Papikondalu Boat Journey with Family - పాపికొండల అందాలు చదివేద్దాం రండి - Discover the Breathtaking Beauty of Papikondalu: A Boat Journey from Bhadrachalam


పాపికొండల అందాలు చదివేద్దాం రండి! Click for English Verison

ఇప్పుడు మీరు చదవబోయె విహారయాత్ర ప్రకృతి అందాలకు నెలవైన, దట్టమైన అడవిలో మరియు పరవళ్లు తొక్కే గోదావరి నదిలో సాగే పాపికొండల పడవ యాత్ర.


హైదరాబాద్ నుండి అక్బర్ ఫ్యామిలి రైలు మార్గంలో, హాజిమియా ఫ్యామిలి మరియు అష్రఫ్ ఫ్యామిలి మంచిర్యాల నుండి రైలు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేసి మరుసటిరోజు ఉదయం భద్రాచలం నుండి రోడ్డు మార్గంలో పోచవరం బోటింగ్ పాయింట్ కి చేరుకొని పడవయాత్ర కి సిద్దంగా ఉన్నారు.

భద్రాచలం మీదుగా పోచవరం నుండిసాగే పడవ యాత్రకు టిక్కెట్టుధర పెద్దలకు Rs.1250/- మరియు పిల్లలకు Rs.1050/-. 

అందమైన పాపికొండల మధ్య బోటు ప్రయాణం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుంది. పాపికొండల యాత్రలో పాపికొండలు చూడడం కంటే కూడా, పడవ ప్రయాణమే అత్యంత ఆకర్షణీయం. నదికి ఇరువైపుల ఎత్తయినకొండలు, దట్టమైన అడవి, నదిమద్యలో వెండిగిన్నెల మెరిసిపోయే ఇసుక తిన్నెలు, మధ్యలో పరవళ్లుతొక్కే గోదారిపై బోటులో షికారు చేయడం జీవితాంతం గుర్తుండిపోయే తీపిజ్ఞాపకాలు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతోనిండిన పాపికొండల మధ్య బోటు ప్రయాణం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు పర్యాటకులు. అఖండ జలనిధితో వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరికి యెదురీధుతూ పడవ సాగుతుంది.

http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour

పడవ ప్రయాణం మొదలయిన కొంచెం సమయానికి అనగ తొమ్మిది గంటలకు పడవ యాజమాన్యం అక్బర్ గార్ల కుటుంబానికి మరియు పడవలోని అందరికి అల్పాహారం అందించారు, బ్రేక్ ఫాస్ట్ లో అందరు ఉప్మా తిన్నారు. బ్రేక్ ఫాస్ట్ చేస్తునే వారి పడవ ప్రయాణం ముందుకు సాగింది. 

ఇప్పుడు కొంచెం పాపికొండల గురించి తెలుసుకుందాం. పాపికొండలు, దక్షిణ భారతదేశంలోని తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వతశ్రేణి. ప్రకృతి ప్రేమికులకు ఉత్తమ పర్యాటక ప్రదేశం. పాపికొండలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలు మరియు తెలంగాణలోని ఖమ్మం జిల్లాల సరిహద్దు సంగమ ప్రాంతంలో ఉన్నాయి. పాపికొండల పర్వతశ్రేణి గోదావరినదివెంబడి విస్తరించి ఉంది. ఈ ప్రాంతం 1,012.86 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించివుంది. ఇది అంతరించడానికి చేరువలో వున్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో జీవవైవిధ్యంగల ప్రదేశం. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణలోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోవున్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులురాల్చవు. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణము కారణంగా ఆంధ్రాకాశ్మీరం అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్దపులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిదరకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం వుంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు వున్నాయి.

గోదావరినది, బాగా దట్టంగా ఉండే అడవులు. పూర్తిగా పల్లెటూరి వాతావరణం. ఇప్పటికీ దగ్గర్లో దొరికేకలపతోనే వంటలు చేసే కొంతమంది జనం. ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని చూడాలి అని అనుకునేవారందరికీ పాపికొండలు స్వాగతంచెప్తాయి. పాపికొండలు ఒక్కటే కాదు అక్కడే ఉండే పేరంటాలపల్లి, కొల్లూరు బేంబూ హట్స్, పోలవరం ప్రాజెక్ట్, కొరటూరు కాటేజెస్ అన్నీ చూడాల్సిన ప్రదేశాలే. ఇంకా ఇక లాంచీలమీద ప్రయాణం మర్చిపోలేని మధురానుభూతినిస్తుంది. అసలు పాపి కొండలకి ఈ పేరు ఎలా వచ్చిందంటే. కొండల మధ్య ప్రవహించే గోదావరి మనం జుట్టుకు తీసుకునే పాపిడిలా వుంటుందని పాపిడి కొండలు అన్నారట. అలా అలా పాపికొండలయ్యిందని అంటారు. 

http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
ఇక్కడ శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. పద్దెనిమిదివందల శతాబ్ధంలో రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలుదేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రికావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది.

http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour

నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి పదహారు వందల కిలోమీటర్లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్రంలో కలుస్తుంది. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కిలోమీటర్ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండి  రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది. రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపొతాయి. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది. అంతేకాక త్వరలోనే పాపికొండలు, ఆ కొండలమధ్యలో ప్రశాంతంగా ప్రవహించే గోదావరి అందాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ కారణంగా కనుమరుగు కాబోతున్నాయి.


పేరంటాలపల్లి 
గ్రామం

పేరంటాలపల్లి పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఒక మారుమూల గిరిజన గ్రామం. పర్యాటకులు ఇక్కడి అందాలను ఆస్వాదించేందుకు ఆగు తారు.

http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
పందొమ్మిదివందల ఇరవయ్యెడులో బాలానంద స్వామీజీ ఈ గ్రామంలో శ్రీకృష్ణ మునివటాన్ని నిర్మించారు. చరిత్ర ప్రకారం, బాలానందస్వామి పందొమ్మిదివందల ఇరవయ్యారులో మోటారులాంచీలో గోదావరినదిపై రాజమండ్రి నుండి భద్రాచలం వెళుతుండగా పేరంటాలపల్లి గ్రామానికి చేరుకుని ఒక రాత్రి బస చేశారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలకు ఆయన ముగ్ధులయ్యారు. అప్పుడు ఒక మహిళ అతనికి కనిపించి, తనను అనుసరించమని కోరింది. నదిఒడ్డున పొదలు మరియు ప్రవాహంతో కప్పబడిన ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఆమె అదృశ్యమైంది. ఆమె కోసం ఎదురుచూస్తూ ఆ రాత్రి అక్కడే గడిపాడు. మరుసటి రోజు ఉదయం, అతను శివుని విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు మరియు అక్కడ ఒక మంటపాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మంటపానికి శ్రీకృష్ణ మునివటం అని పేరు పెట్టారు. 

http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
గ్రామానికి విద్యుత్ లేదు, వారు సౌరశక్తితో జీవిస్తున్నారు మరియు పడవలు తప్ప రహదారి లేదా ఇతర మార్గాల ద్వారా గ్రామానికి చేరుకోలేరు. ఈ ప్రాంతంలో పట్టణ జీవితం మరియు సంస్కృతికి పూర్తిగా పరిచయంలేని గిరిజనులు నివసిస్తున్నారు. ఈ తెగల ప్రధాన ఆదాయ వనరు వెదురుతోకూడిన వస్తువులను తయారుచేయడం. అవి పూర్తిగా చేతితో తయారుచేయబడినవి మరియు చక్కని అలంకరణ వస్తువులు. 

పేరంటాలపల్లి దర్శన విరామం తరువాత మళ్లీ పడవ ప్రయాణం మొదలైనది. దర్శనం చేసుకునేవారు శివుని దర్శనం చేసుకొని, వారితో తెచ్చుకున్న కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అక్బర్ కుటుంబం మాత్రం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించి ఫోటోలు తీసుకొని మళ్లీ పడవ ఎక్కడం జరిగినది. ఇప్పటికి పడవ ప్రయాణం మొదలై దాదాపు మూడు గంటలు కావస్తోంది. ఉప్మా తిని బయలుదేరిన అందరు ఇప్పుడు లంచ్ కోసం ఏదురుచూస్తున్నారు.

http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
నది అందాల మద్య బోటు ప్రయాణం సాగుతుండగా బోటు కొల్లూరు అనే ఊరికి చేరుతుంది. అడ్డతీగల నుండి వచ్చే పాములేరు గోదావరిలో కలిసే స్థలంలో ఇసుక తిన్నెలపై వెదురు బొంగులతో నిర్మించిన గుడిసెలు అక్కడ కనిపిస్తాయి. వాటిలో రాత్రి బస చేయాలనుకున్న వారు ముందే టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. అక్కడ గుడిసలలో రాత్రి బస చేసే వారికి ఆ అనుభవం మరపురాని అనుభూతినిస్తుంది. పాపికొండలు మరియు కొల్లూరు నదీగర్భంలోని సుందరమైన దృశ్యాన్ని చూసి మీరు మైమరచిపోతారు. చల్లని రాత్రిలో ఇసుక తిన్నెల మద్య గోదావరి అందాలను వీక్షిస్తూ చలిమంటల చుట్టూ చేరి కబుర్లు చెప్పుకునే క్షణాలను వర్ణించలేము. రాత్రి బాగా చేయడానికీ ప్యాకేజీ తీసుకున్న వారు మాత్రమే ఇక్కడ దిగుతారు. ఒక్కరోజు బోటు ప్రయాణం చేసేవారు ఇక్కడ దిగరు, బోటుపై నుండి చూడడమే. కొల్లూరు రివర్ బెడ్లోని పూర్తి పర్యావరణం చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మరియు ఇంటికి దూరంగా ఉంటుంది. మీ హార్ట్ బీట్ ఖచ్చితంగా ఉత్సాహంతో పెరుగుతుంది మరియు ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు మరియు facebook మరియు ఇతర సోషల్ నెట్వర్క్ల కోసం కూడా చాలా జ్ఞాపకాలు మరియు photos తీసుకువెళతారు. పోచవరం నుండి కొల్లూరు రివర్ బెడ్ వరకు మీ ప్రయాణం జీవితకాల అనుభవంగా ఉంటుంది మరియు మీరు ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు సందర్శించాలని కోరుకుంటారు. ఈ ప్రయాణం అన్ని వయసుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 

వేసవి కాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం దగ్గర జలపాతం ఉంది. ఇక్కడ సర్పం నీడలో శివలింగం అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంది. రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.

ఓ వైపు గోదావరి విశేషాలను చెప్తూనే....పడవలోని సిబ్బంది నృత్యాలు, చక్కని జోకులతో సందర్శకులను అలరిస్తుంటారు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారు డెక్ పైనా కూర్చోని ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు. ఓ వైపు గోదావరి గలగలలు.. మరో వైపు ప్రకృతి సొయగాలు.. చుట్టూ కొండలు.. అద్భుతమైన వాతావరణం.. వీటన్నింటి నడుమ ప్రయాణమే పాపికొండల యాత్ర. గోదావరమ్మ సడులను వింటూ.. పాపికొండల అభయారణ్యాన్ని చూస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణిస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. 

http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
గోదావరి చెంత వెన్నెల రాత్రి లో ఇసుక తిన్నెలపై సేదతీరడం ప్రకృతి ప్రేమికులకు జీవితంలో ఒక మధుర స్మృతిగా మిగిలిపోనుంది. గోదావరికి రెండువైపులా దాదాపు 30 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఈ కొండల అందాలను గోదావరిలో బోటుపై ప్రయాణిస్తూ చూసేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకుల తరలివస్తారు. పూర్తి భద్రతా ఏర్పాట్ల నడుమ పాపికొండల యాత్ర జరుగుతుంది. రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలం పట్టణం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనూ పాపికొండలు ఉన్నాయి. పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ద్వీపం నుంచి మొదవుతుంది. అక్కడి నుంచి పోలవరం, గొందూరు, సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది. వీటికి బ్యాంబూ హట్స్ కూడా తోడవంతో పర్యాటకులకు పాపికొండల ట్రిప్ మధురానుభూతిని పంచుతోంది.

http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
http://www.akbarphotography.in - Papikondalu Boat Tour
దక్షిణ భారతదేశంలోని పచ్చటి కొండల మధ్య ఉన్న పాపికొండలు ప్రకృతి ప్రేమికులకు ఉత్తమ పర్యాటక ప్రదేశం. పాపికొండలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలు మరియు తెలంగాణలోని ఖమ్మం జిల్లాల సరిహద్దు సంగమ ప్రాంతంలో ఉన్నాయి. భద్రాచలం మీదుగా పోచవరం నుండిసాగే పడవ యాత్రకు టిక్కెట్టుధర పెద్దలకు Rs.1250/- మరియు పిల్లలకు Rs.1050/-. 

పడవలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు: బోటు సిబ్బంది మరియు గైడ్‌తో బోట్ మేనేజర్. టాయిలెట్ మరియు సీటింగ్‌తో కూడిన గ్రౌండ్ ఫ్లోర్. డయాస్ మరియు ఆడియో సిస్టమ్తో ఓపెన్ డెక్‌లో మొదటి అంతస్తు. అలాగే బోటు సిబ్బంది చేసె కాంప్లిమెంటరీ వినోద కార్యక్రమాలు.

Discover the Breathtaking Beauty of Papikondalu: A Boat Journey from Bhadrachalam

Papikondalu is a picturesque hill range located in the Eastern Ghats of Andhra Pradesh, India. The hills are named after the Papi Hills, which form a part of the range. The Papikondalu Boat Journey is a popular tourist attraction that takes visitors from Bhadrachalam to Papikondalu. It is a one-of-a-kind experience that offers breathtaking views of the hills and the Godavari River.

The journey starts from Bhadrachalam, a small town located on the banks of the Godavari River. The town is known for its ancient temple dedicated to Lord Rama and attracts a large number of devotees every year. The boat journey from Bhadrachalam to Papikondalu takes around 5-6 hours, covering a distance of approximately 40 kilometers.

The boats used for the journey are specially designed to navigate through the narrow and winding stretches of the river. They are made of wood and have a capacity of around 50-60 passengers. The boats are equipped with basic amenities like washrooms and seating arrangements.

The journey takes visitors through some of the most scenic spots in the region. The hills are covered with dense forests and are home to a wide variety of flora and fauna. Visitors can spot several species of birds and animals during the journey, including monkeys, deer, and peacocks.

One of the highlights of the journey is the Papi Hills. The hills rise to a height of around 1500 meters and offer stunning panoramic views of the surrounding area. Visitors can take a short hike up the hills to enjoy the views or simply relax on the boat and soak in the beauty of the surroundings.

The journey also takes visitors through several small villages located along the banks of the river. These villages are known for their unique culture and traditions and offer a glimpse into the rural life of the region. Visitors can interact with the locals and learn about their way of life.

The boat journey culminates at Papikondalu, a small village located on the banks of the river. The village is surrounded by hills on all sides and offers a serene and tranquil environment. Visitors can explore the village, visit the local temples and interact with the villagers.

Overall, the Papikondalu Boat Journey is a must-do experience for anyone visiting the region. It offers a unique opportunity to explore the natural beauty and cultural heritage of the Eastern Ghats. The journey is best enjoyed during the monsoon season when the river is in full flow and the hills are covered with lush greenery. Visitors can book the boat ride through various tour operators in Bhadrachalam and can choose from different packages depending on their preferences and budget.


Search Website

Featured Post

10 Tourist Places to Visit in Coorg - తెలుగులో కూర్గ్ ట్రిప్ - Scotland of India

Click for  English Version -   కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు ఇప్పుడు మీరు చదవబోయె ప్రాంతం. ఇక్కడి లోయల్ని, కొండ ...

Popular Articles